సిరా న్యూస్,మేడ్చల్;
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దాదాపుగా నాలుగు తులాల బంగారం, ఆరు వేల నగదును దొంగలు దొంగిలించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మైగూడ అంజనాద్రి నగర్ కాలనీలో దాసరి మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈఘటన జరిగింది. శ్రీకాళహస్తి దేవాలయనికి వెళ్లి తిరిగి నిన్న రాత్రి ఇంటికి వచ్చి చూసెరికి ఇంట్లోని బెడ్ రూంలోని బీర్వాలోని వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు దొంగతననం జరిగింది అని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
====