సిరా న్యూస్, సైదాపూర్:
నీట్ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించాలి: ఎన్ఎస్యూసీ మండల అధ్యక్షుడు కొంకట విద్యాసాగర్
నీట్ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించాలి ఎన్ఎస్యూసీ సైదాపూర్ మండల అధ్యక్షుడు కొంకట విద్యాసాగర్ అన్నారు. గురువారం మండలంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ ను మళ్లీ ఒకసారి నిర్వహించాలని ఆయన కోరారు. నీట్ ఎగ్జామ్ లో అక్రమాలకు పాల్పడ్డ ప్రొఫెసర్లను విధులనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోషన్, రాయిశెట్టి పవన్, తిరుపతి నాయక్, వినయ్ ,సన్నీ లు పాల్గొన్నారు.