సిరా న్యూస్,బోథ్
పాట్నాపూర్లో బోరుబావులకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించండి
* ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేసిన రైతులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 27 మంది రైతులు తమ చేలలో పంటలకు సాగునీరు అందించేందుకుగాను నూతనంగా బోరు బావులను తవ్వించుకున్నారు. అయితే వారికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నూతనంగా అవసరమైన విద్యుత్తు లైన్ వేయించాలని అందుకు ఐటీడీఏ సహకారం అందించాలని విన్నవించారు. గురువారం ఐటీడీఏ పీఓకు గ్రామానికి చెందిన 27 మంది రైతులు వినతి పత్రం అందించారు. స్పందించిన పి ఓ అవసరమైన ఎస్టిమేషన్ వేయించుకొని రావాలని, ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడడం జరుగుతుందని పిఓ చెప్పారని రైతులు పేర్కొన్నారు.