సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరపడ్డ వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్ ప్రశాంత్ నగర్ లో ఒంటిపై బట్టలు లేకుండా వచ్చి ఇంట్లో చొరపడ్డాడు ఆ ఇంటి యజమాని సీసీ కెమెరాలను స్క్రీన్ పై చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇంట్లోకి చొరబడ్డాడు దొంగతనానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బుధవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన మొత్తం ఇంటి యజమాను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి..
==