సిరాన్యూస్, ఖానాపూర్
రాథోడ్ రమేశ్ జ్ఞాపకార్థం మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు స్వర్గీయ రాథోడ్ రమేష్ జ్ఞాపకార్థం ఖానాపూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని జగన్నాథ్ చౌక్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ రమేష్ రాథోడ్ కు నివాళులు అర్పించి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ , మండల ప్రజలు బీజేపీ కార్యకర్తలు, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.