సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని మధు శివాని(12) నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.మధ్యాహ్నం 12:30 గంటలకు నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని తాగినట్లు విద్యార్థిని తెలిపింది. ఛాతిలోనొప్పి మేడం అన్నా విద్యార్థిని మాటలు కస్తురిబా సిబ్బందిపట్టించకోలేదు. విద్యార్ధిని నిర్లక్ష్యం వహించారు. మధ్యాహ్నం12గంటలకు తాగితే సాయంత్రం 3 గంటలకు ఆసుపత్రికి పంపారు. ముక్కులో నుంచి రక్తం వచ్చాక స్పందించి కుటుంబ సభ్యులను పిలిచి ఆసుపత్రికి పంపించారని బాధితురాలు తెలిపింది. ముందుగా కుల్కచర్ల లో ప్రథమ చికిత్స అందించి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు..హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం చేసిదంటుంన్నరు కస్తూరిబా పాఠశాల ఇంచార్జి వార్డన్ భాగ్యమ్మ.