నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
సిరా న్యూస్,అమరావతి;
భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై అలుపెరుగని సాయుధ పోరాటం చేసి, అదే సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన త్యాగదనుడు, యోధుడు అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. జూన్ 4 న అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా..ఇదే రోజున ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి, నారా చంద్రబాబు నాయుడు గారు అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహాజ్వాలశక్తిగా అల్లూరి సీతారామరాజు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బ్రిటిష్ వారితో అలుపెరగని పోరాటం చేసి, అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల వయసులోనే అసువులు బాయటం బాధాకరమని అన్నారు
==========