సిరా న్యూస్,హైదరాబాద్;
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసారు. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేసారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ ను ఆదేశించారు.
====