సిరాన్యూస్, ఓదెల
నాటిన మొక్కలను సంరక్షించాలి: మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి
* వన మహోత్సవం ప్రారంభం
నాటిన మొక్కలను సంరక్షించాలని ఓదెల మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని శుక్రవారం స్థానిక దాసరి పద్మ హనుమయ్య జిల్లా పరిషత్తు పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓదెల మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి (డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్) పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించాలని, నాటిన మొక్కలు అన్నిటిని కూడా సంరక్షించాలని పిలుపునిచ్చారు. తర్వాత పాఠశాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించి, పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రధానోపాధ్యాయుల తో సమీక్ష నిర్వహించి.. పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల ఎంపీడీవో తిరుపతి , ఎంపీ ఓ భాస్కర్ , ఏపీఎం లతామంగేశ్వరి ,పంచాయతీ కార్యదర్శి ముత్యాల సందీప్, ప్రధానోపాధ్యాయులు ఎర్ర రమేష్ ,ఇన్చార్జ్ ఏపీవో శ్వేత , టెక్నికల్ అసిస్టెంట్ జనార్ధన్ , పిడి విష్ణు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.