Odela: ఓదెల‌లో విద్యార్థి సంఘాల నాయ‌కుల ముందస్తు అరెస్ట్

సిరాన్యూస్‌, ఓదెల
ఓదెల‌లో విద్యార్థి సంఘాల నాయ‌కుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలోగ్రూప్ 2,3 ఉద్యోగాలు పెంచాలని, డీఎస్‌సీ పోస్టులు పెంచాలని కోరుతూ నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్‌సీ ముట్టడి, వివిధ కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్ర‌వారం పొత్కపల్లి పోలీసులు తెల్లవారుజామున 3.30 కి విద్యార్థి సంఘాల నాయ‌కుల గృహానికి చేరుకున్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్, హిందు వాహిని మండల అధ్యక్షుడైన శాతల కుమార్‌ ముందస్తుగా అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *