సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నాగర్ కర్నూలు లో పర్యటించారు. హాజీపూర్ చౌరస్తా వద్ద మంత్రికి నాగర్ కర్నూల్ జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు నర్సింగ్ సిబ్బంది స్వాగతం పలికారు.
ఈ జిల్లాలో ఉన్న సమస్యలపై చర్చించారు.జిల్లాలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా విస్తరించకుండా నిర్మూలన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వైద్య అధికారులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.