సిరాన్యూస్, ఆదిలాబాద్
షీ టీమ్స్పై చావరాకాడమీ పాఠశాల విద్యార్థులకు అవగాహన
షీ టీమ్స్పై శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని చావరాకాడమీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా షీటీం బృందం సభ్యుడు జి సత్యమోహన్ మాట్లాడుతూ బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 100, 1930 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.విద్యార్థులు , యువతులు ఫోటోలు దిగి స్టేటస్ లో పెట్టడం , ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం , ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం గానీ ఇలాంటివి చేసే అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేసి మోసాలకు దారితీస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి సారించాల న్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఐటీ కోర్ డిఎస్పి , హసీబుల్లా హెచ్ఎం తోమి తోమస్ ఉపాధ్యాయ బృందం , టెక్ టీం సభ్యులు రియాజ్ షీటీం బృందం జి సత్యమోహన్ బి సుశీల పాల్గొన్నారు