G. Kishore: ప్రధానోపాధ్యాయుడు జి. కిషోర్‌కు ఘ‌న స‌న్మానం

సిరాన్యూస్‌, బేల‌
ప్రధానోపాధ్యాయుడు జి. కిషోర్‌కు ఘ‌న స‌న్మానం

ఆదిలాబాద్ జిల్లా మండలంలోని కాంగారుపూర్ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్లుగా విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయుడు జి. కిషోర్ గుడిహత్నూర్ మండలానికి బదిలీ అయ్యారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో గ్రామస్తులు ఆయనకి శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు.విద్యార్థుల చేరికలను పెంచడంతో పాటు పాఠశాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గ్రామస్తులు కొనియాడారు. ఒకప్పుడు మూతపడే దశలో ఉన్న పాఠశాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో శ్రమించారు అంటూ ఆయన సేవలను కొన్ని ఆడిన పలు ఊరు భావోద్వేగానికి గురయ్యారు. గ్రామస్తులు నానాజీ చర్దే, సందీప్ ధోలే, ప్రభాకర్,అతుల్, హేమ్రాజ్, సునీల్, విలాస్ చర్డే, బండు వంకర్, ఉపాధ్యాయులు నాగనాథ్, విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *