సిరాన్యూస్, ఆదిలాబాద్
జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి-వెంకటరెడ్డికి ఆత్మీయ సత్కారం
కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణుల వేడుక
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యురాలిగా జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి-వెంకటరెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు శాలువాతో అరుంధతి-వెంకటరెడ్డి దంపతులను , మావల ఎంపీపీ భర్త ఏవన్ ను ఘనంగా సత్కరించారు. ఐదేండ్ల కాలంలో ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఈ ఐదేళ్ల కాలంలో తనకు ప్రతీ పనిలో మద్దతుగా నిలిచి, తనను ఆదరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ,అధికారులు, మిత్రులు శ్రేయోభిలాషులకు ప్రతిఒక్కరికీ పేరుపేరునా తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ,జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఆవుల వెంకన్న,రామ్ కుమార్, భూమన్న,ఆనంద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయిన్ వార్ గంగా రెడ్డి,నాయకులు తమ్మల చందు,డేరా కృష్ణ రెడ్డి, యాల్ల పోతా రెడ్డి,జల్పత్ రావు శ్రీలేఖ ఆదివాసీ తదితరులు పాల్గొన్నారు.