Tula Srinivas: క్రమశిక్షణ ,నైతిక విలువలతో ముందుకు వెళ్లాలి:  మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

సిరాన్యూస్‌, బోథ్:
క్రమశిక్షణ ,నైతిక విలువలతో ముందుకు వెళ్లాలి:  మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

విద్యార్థులు క్రమశిక్షణ ,నైతిక విలువలతో ముందుకు వెళ్లాలని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల‌లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సోమ‌వారం ఉపాధ్యాయుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు.ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడారు. నేను 1990 సంవత్సరంలో ఇదే పాఠశాలను నుండి పదవ తరగతిలో ప్రథమ స్థాయిని పొందాన‌ని తెలిపారు. తదనంతరం న్యాయ విద్యను అభ్యసించి అడ్వకేట్ గా పని చేస్తూ, రాజకీయ రంగంలోకి రావడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థినిని అని విద్యార్థులతో పరిచయం చేసుకొని, విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని, భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఎలాంటి చెడు అలవాట్లకు లొంగకుండా మంచి పౌరులుగా తయారు కావాలని సోనాల గ్రామ పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల జరిగిన పదోన్నతుల్లో పాఠశాలకు వచ్చిన 15 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేశ్ముఖ సచిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *