Assault on Medical Sutudents: వైద్య విద్యార్థులపై దాడిని ఖండిస్తున్నాం…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

వైద్య విద్యార్థులపై దాడిని ఖండిస్తున్నాం…

– మాజీ మంత్రి జోగు రామన్న


ఆదిలాబాద్‌ పట్టణం రిమ్స్‌లో మెడికోలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట మెడికోలు నిర్వహించిన ధర్నాలో పాల్గొని, తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా అర్థరాత్రి రిమ్స్‌లో జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌ కమిటీ వేసి, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసారు. బాధితులను కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమై చర్యలు తీసుకోవాలని అన్నారు. మెడికోలకు తాము అండగా ఉంటామని, ఎవరూ కూడ భయాందోళనలకు గురికావద్దని ఆయన సూచించారు. విద్యార్థులకు రక్షణ కల్పించడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు ఫోన్‌ సమస్య గురించి వివరించారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న కలెక్టర్‌ విద్యార్థులతో మాట్లాడి శాంతిపజేసారు. ఈ ధర్నాలో వైద్యవిద్యార్థులు, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, ఫ్లోర్‌ లీడర్‌ బండారి సతీష్, నాయకులు సాజితోద్దీన్, మెట్టు ప్రలాద్, యూనిస్‌ అక్బనీ, వేణు యాదవ్, రామ్‌ కుమార్,ఇజ్జగిరి నారాయణ, దివిటి రాజు, శివకుమార్, ప్రశాంత్,ఇబ్బు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *