సిరాన్యూస్, ఓదెల
బీరాన్న బోనాల ఉత్సవాలలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో ఆదివారం గొల్ల కూర్మ ప్రజల ఆధ్వర్యంలో బిరాన్నబోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొన్నారు.అనంతరం ఆమె బోనం ఎత్తుకున్నారు. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ బీరన్న బోనాలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఓదెల మాజీ జడ్పీటీసీ గంట రాము యాదవ్, బొంగోని వెంకటేష్ , కుల పెద్దమనిషి ఏళ్ల స్వామి , ఆముదలా అరుణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.