Rajura Satyam: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్సార్:  మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్సార్:  మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘ‌నంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్సార్ అని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. సోమ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా నాయకుడు, తుది శ్వాస వరకు ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధోనికెని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ , మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు సౌకత్ పాషా, నాయకులు లక్మి పతి, ద్యవతి రాజేశ్వర్,శేషాద్రి, గోవింద్, రాజ్ కుమార్, చరణ్, శివ,సంతోష్, మలయ్య యాదవ్, నిట్ట రవి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *