DSP Boini Sadan Maharaj: ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగ‌న్‌వాడీల నిర‌స‌న

సిరాన్యూస్‌, చిగురుమామిడి
ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగ‌న్‌వాడీల నిర‌స‌న
* అంగ‌న్‌వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలి
* ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బోయిని సదన్ మహరాజ్

అంగన్ వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాల‌ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ చేశారు. సోమవారం హుస్నాబాద్ లోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. ఈసంద‌ర్భంగా అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ ఆధర్ లో ఉన్న 65 ఏళ్ల వయసు ఖచ్చితమైనది కాదని, అప్పట్లో ఏదో అంచనా ప్రకారం ఆధార్ కార్డు లో తప్పుగా వయసు నమోదు చేశారని తెలిపారు.వయసు నిర్ధారించడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో బోన్ టెస్టు జరపకుండా ఏ విధంగా రాజీనామాలు చేయిస్తారని అన్నారు. వారసత్వంగా తమ కుటుంబ సభ్యులకు అంగన్వాడీ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ బెనిఫిట్స్ కింద రెండు 2.లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.గత 30 40 సంవత్సరాలుగా అంగన్వాడీ వృత్తి చేస్తున్నామని, ఇప్పుడు రాజీనామా చేయమంటే ఏ విధంగా బ్రతకాలని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోయిని సదన్ మహరాజ్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత‌ వరకు ధర్మ సమాజ్ పార్టీ అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల నరేష్, అక్కన్నపేట మండల అధ్యక్షుడు వద్దిరాల సతీష్, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *