సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఈనెల 10న బీడీ కార్మికుల ధర్నా
* తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేష్
ఈనెల 10న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీడీ కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈనెల 10న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే బీడీ కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఖానాపూర్ మండలంలో పలు గ్రామాలలో వీడి కార్మికుల కంపెనీలలో విస్తృతంగా కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో బీడీ కార్మికులందరికీ పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన నేటి వరకు అమలు చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ పరిశ్రమల పనిచేస్తున్న బీడీ ప్యాకింగ్, కాటన్, నెలసరి ఉద్యోగులకు ఆంక్షలు లేకుండా ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం లింగన్న, డివిజన్ నాయకులు మాలావత్ జెవింధ్, మద్దినేని చిన్న రాజన్న, ముంజం దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.