మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు
సిరా న్యూస్,కమాన్ పూర్;
పేదల పాలిట పెన్నిధి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు మాజీ ఎంపీపీ కోలేటి మారుతి అన్నారు. సోమవారం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైనాల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ మరియు 108 తో పాటు ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు మేలు చేశారని అన్నారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి గుండారం రిజర్వాయర్లోకి 2 టిఎంసి ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు కు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్యాల రామ్ చంద్రం గౌడ్ శేఖర్ చిగురు మండయ్య వడ్డాల శ్రీనివాస్ కొంచెం శ్రీనివాస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుక్క రవి అంజి గడ్డం శ్రీనివాస్ పిడుగు శంకర్ జంగిలి కొమురయ్య బుర్ర సత్యం తదితరులు పాల్గొన్నారు.