సిరాన్యూస్,బోథ్
ఎంపీ జి నగేష్ ను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా గెలుపొందిన జి నగేష్ సోమవారం బోథ్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదిలాబాద్ లోని ఆయన స్వగృహంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీకి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నపాగ అశోక్, కారం రవి, పాలెపు గోపి ప్రసాద్, మాజీ జిల్లా అధ్యక్షులు గజ్జల శంకర్, తదితరులు ఉన్నారు.