ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం..ఇద్దరికి తీవ్ర గాయాలు

సిరా న్యూస్,ఇబ్రహీంపట్నం;
ఎన్టీటీపీఎస్ ఐదో దశ ప్లాంట్ లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు ప్రారంభించారు. అకస్మాత్తుగా డోర్ లు ఓపెన్ అయి వేడి యాష్, మంటలు బయటకు వచ్చాయి. ఆ సెగలతో ఒక ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని అధికారులు చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ 40 శాతానికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదో దశ ప్లాంట్ లో భద్రతా వైఫల్యంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *