సిరాన్యూస్, కుందుర్పి
లక్ష్మీకాంతప్ప కుటుంబానికి రూ.50వేల అందజేసిన మాజీ
కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిమండలం మలయనూరు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయపడిన లక్ష్మికాంతప్ప బాధిత కుటుంబాన్ని మంగళవారం కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పరామర్శించారు. అనంతరం రూ. 50 వేల రూపాయలు చెక్కును అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామ , ఉమామహేశ్వరనాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.