సిరా న్యూస్,మెదక్;
లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు.-మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్సై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు.
స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. బిక్కనూర్ కు చెందినజర్నలిస్టు, మస్తాన్ మధ్యవర్తి గా ఉన్నాడు. బాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు “లంచం” తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.