Dr. Sarfraz: వాగులు దాటి వైద్య శిబిరం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
వాగులు దాటి వైద్య శిబిరం
* మంగ్లీలో  వైద్య ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ డా సర్ఫరాజ్

వర్షాకాలం సీజనల్ వ్యాధుల‌ నివారణకు ప్రభుత్వ వైద్యులు వాగులను సైతం దాటి గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు. ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లంలోని అంకోలి పీహెచ్‌సీ ప‌రిధిలో మామిడిగూడ స‌బ్ సెంట‌ర్‌లోని వాన్వట్ గ్రామపంచాయతీలోని మంగ్లీలో మంగ‌ళ‌వారం వైద్య శిబిరం నిర్వ‌హించారు. అనంత‌రం ప్రజలందరికీ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి డాక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్‌ అవగాహన కల్పించారు. గర్భిణుల‌కు,పిల్లలకు,ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. మలేరియా వ్యాధి పైనా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఇండ్లలో వేపపొగ, దోమ తెరలు వాడాలని తెలిపారు.ఈ కార్యక్రమములో సూపర్ వైజర్ మర్సకొల లక్ష్మీ బాయి, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి,పవర్ ప్రేమ్ సింగ్,రాథోడ్ నారాయణ్, ముయ్యాల మోతి, ఆశాకార్యకర్తలు సుమిత్ర,రుక్మిణి, తూర్పా బాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *