సిరా న్యూస్,పెద్దపల్లి;
సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మహబూబాబా ద్ కు చెందిన కూలీలు రాముల మ్మ శ్రీనివాస్ ఏడేళ్ల కుమారుడు విలియమ్స్ ప్రభుత్వాసుపత్రిలోని సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. వివరాల్లోకి వెళ్లితే మంగళవారం బాలుడి తండ్రి శ్రీనివాస్ విరోచనాలతో ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయినట్లు పలువురు గుర్తించి బయటకు తీశారు. అప్పటికి బాలుడు మురుగు నీరు తాగడంతో తీవ్ర అస్వస్థ కు గురయ్యాడు. వైద్య చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బాలున్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వాసుపత్రి లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు, పలువురు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని ఆ తల్లితండ్రులు రోదిస్తుంటే పలువురి కళ్ళు చెమర్చాయి. జిల్లా కేంద్రంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక మండల, గ్రామాల్లోని ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఉన్నాతాధికారులు అర్ధం చేసుకోవాలి. బాద్యులపై చర్యలు తీసుకొని, ఆ బాలునికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.