సిరా న్యూస్, ఓదెల
గిరిజన సీత్లా పండగ ఉత్సవాల్లో బీఆర్ఎస్ దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లంబాడీ తండా గ్రామంలో గిరిజన లంబాడీ కుటుంబాలు తరతరాలుగా జరుపుకుంటున్న సీత్లా పండుగ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా నిర్వహించిన ఉత్సవంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని లంబాడి మహిళలతో కలిసి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ సీత్లా పండగ సందర్భంగా మహిళలందరూ ఒకచోట చేరి అమ్మవారిని దర్శించుకొని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో లంబాడీ తండ మాజీ సర్పంచ్ లక్ష్మి వస్రం నాయక్, నాంసానిపల్లీ మాజీ సర్పంచ్ పోతుగంటి రమ రాజు, లంబాడి గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు దేవీలల్, హారిపురం మల్లేష్ యాదవ్, మంగా,బయమ్మపల్లి మండల యూత్ ఉపధ్యక్షుడు, బండ నిఖిల్ కుమార్ యాదవ్, బిక్కు నాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.