తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ధర్నా
సిరా న్యూస్,హైదరాబాద్;
నాంపల్లి ఏంజె మార్కెట్ వద్ద రిజిస్ట్రేషన్ కమిషనర్ కార్యాలయం ముందు అసోసియేషన్ నాయకులు ధర్నా చేసారు. ఆగస్టు 1న భూమి విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి.
ఇప్పటికే కుదేలువుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పేదోడికి సొంతింటి కలను దూరం చేస్తుంది. భూముల మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు ప్రకటన వచ్చింది కావున మార్కెట్ విలువలు పెంచి స్టాంప్ డ్యూటీ ని 7.5 నుండి 3,% తగ్గిస్తే ప్రజల పై భారం పడకుండ ఉంటుంది.
గ్రామ పంచాయితీ లేఅవుట్ ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లను వెంటనే కొనసాగించాలి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఆగి పోయాయి. వాటిని రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి 2 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్లాట్లు కొన్న ప్రజలు రిజిస్ట్రేషన్ లు కాక ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ లకు అనుమతించ గలరని ప్రభుత్వన్నీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
==================