సిరాన్యూస్, ఉట్నూర్
జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న ఆడే గజేందర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఘన్పూర్ గ్రామంలోని సేవాలాల్ జగదాంబ ఆలయాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించి, శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, నాయకులు బాబు అంకుష్ తదితరులు పాల్గొన్నారు.