సిరాన్యూస్, భీమదేవరపల్లి
తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హత్య ను ఖండిద్దాం
* తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హత్య ను ఖండిద్దామని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. మంగళవారం భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీనవర్గాల ముద్దుబిడ్డ తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్యను దేశవ్యాప్తంగా బహుజన సమాజం మొత్తం ఖండించాలని అన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంతో పోరాడుతున్న నాయకుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ హత్య కేసును సీబీఐ చే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యూసఫ్, మాడుగుల జయపాల్, వేముల జగదీష్ ,గిరిమళ్ళ చంద్రమౌళి,గంగారపు రవి తదితరులు పాల్గొన్నారు.