సిరాన్యూస్, కడెం
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి వరం :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* సదర్మట్ కెనాల్ ను అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖానాపూర్ నియోజవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశ పెట్టిందని అన్నారు.త్వరలో 1లక్ష రూపాయాలతో పాటు తులం బంగారం అందజేస్తామని పేర్కొన్నారు.చెక్కులను సకాలంలో బ్యాంకులో జమా చేసి విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తుందన్నారు.కడెం ప్రాజెక్టు అభివృద్ధి కోసంరాష్ట్ర ప్రభుత్వం 9కోట్ల 21 లక్షల నిధులు మంజూరు చేసింది అన్నారు. మరోవైపు సదర్మాట్ కెనాల్ ను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.