అక్రమ సంబంధం పెట్టుకుందనే హత్య
సిరా న్యూస్,మదనపల్లె;
అక్రమ సంబంధం పెట్టుకుందనే భార్యను భర్త హత్య చేసినట్లు మదనపల్లె డిఎస్పి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నిమ్మనపల్లె(M) దివిటివారిపల్లె వద్ద గత నెల 27రాత్రి దారుణ హత్యకు గురైన మహిళ కేసును ఛేదించినట్లు డిఎస్పి తెలిపారు. మృతురాలు పలమనేరు నాగులరాళ్లవీధికి చెందిన గణపతి భార్య భారతి(20)గా గుర్తించి, సీఐ సద్గురుడు, ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసును లోతుగా దర్యాప్తుచేపట్టి గణపతిని మంగళవారం నిమ్మనపల్లె క్రాస్ లో అరెస్టు చేశారన్నారు. హత్య జరిగిన రోజు పొలం యజమాని రామాంజులు పూరిపాకలో భారతిని ఎవరో కొట్టినట్లు గమనించి వెళ్లి అడ్డు కోగా అతడిపైనా గణపతి కత్తితో దాడి చేసి పారిపోయాడన్నారు. కాగా భారతి పుట్టినిల్లు పెనుమూరు అన్నారు. తల్లి దండ్రులు నెల్లూరు జిల్లా కొవ్వూరు లో కూలి పనులు చేస్తుంటే భారతి అక్కడికి వెళ్ళిపోయి ప్రియుడు రవీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న బాధ భరించలేకపోయాడన్నారు. పిల్లల్ని పిలుసుకుపోదువు రమ్మని చెప్పి వచ్చాక చేపలు పట్టేందుకు నిమ్మనపల్లె ప్రాజెక్టుకు తీసుకొచ్చిన భర్త గణపతి ఈ హత్య చేసినట్లు తెలిపారు. ప్రతిభ కనబరసిన సిఐ, ఎస్ఐలను డిఎస్పి అభినందించారు.