సిరా న్యూస్,గన్నవరం;
గన్నవరం, బాపులపాడు మండలాలకు చెందిన 11 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి కేసు విచారణ పేరుతో గన్నవరం మండలం అల్లాపురం సర్పంచ్ డొక్కు సాంబశివ వెంకన్న,పడమట నాగరాజు,బాపులపాడు ఎంపీపీ నగేష్,తిప్పనగుంట మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభుకాంత్ తో మరో 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.