Varaprasad Rao: టీజీసీఏబీ చైర్మ‌న్‌ను క‌లిసిన టీపీడీఎంఏ స‌భ్యులు వేముగంటి వరప్రసాద్ రావు

సిరాన్యూస్,బేల‌
టీజీసీఏబీ చైర్మ‌న్‌ను క‌లిసిన టీపీడీఎంఏ స‌భ్యులు వేముగంటి వరప్రసాద్ రావు

తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్ర చైర్మన్‌ మారినేని రవీందర్ రావును వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం టీపీడీఎంఏ సభ్యులు, ఆదిలాబాద్ జిల్లా ఏడీసీఏ సభ్యులు డా వేముగంటి వరప్రసాద్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా రాష్ట్ర బాధ్యతలు చేప‌ట్టిన రవీందర్ రావును ఘన స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా డా వేముగంటి వరప్రసాద్ రావు మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల సమయం లో క‌ళాశాల‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల‌న్నారు. క‌ళాశాల‌లోనే శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులు కి జీరో అకౌంట్లు ఇస్తే పిల్లలకు ఉప‌కార వేత‌నాలు అందే విధంగా ఉంటుంద‌ని తెలిపారు. అందుకు చైర్మన్ రవీందర్ రావు సానుకూలంగా స్పందించి స్పెషల్ డ్రైవ్ ద్వారా విద్యార్థులు జీరో అకౌంట్లు ఇచ్చేలా చూస్తా అని మాట ఇచ్చినట్లు డా వరప్రసాద్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *