సిరా న్యూస్, కళ్యాణదుర్గం
విద్యుత్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వారి కార్యాలయంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వారికి మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను కోతలు లేకుండా అందించాలని మంత్రిని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.