సిరా న్యూస్,విశాఖపట్నం;
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ అనుమానించినట్లుగానే నిందితుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు ఫోన్ వాడకపోవడంతో అతడికి కనుగొనడం పోలీసులకు సవాల్గా మారింది. చివరకు రాంబిల్ల మండలం కొప్పుగుండు పాలెంలో నిందితుడు సురేష్ మృతదేహం లభ్యమైంది. కొప్పగొండపాలెం పరిసరాలలో మృతదేహం బోర్లా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహా న్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.