విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్
బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుడి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
మధ్యాహ్నం భోజనంలో ఉడకని బంగాళదుంప కూర..వడ్డించడం పై కలెక్టర్ ఆగ్రహం
సిరా న్యూస్,బద్వేలు;
పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి 100 శాతం ఫలితాలను సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఉపాధ్యాయులను ఆదేశించారు.బద్వేలు నియోజకవర్గం శ్రీ అవధూత కాశినాయన మండలం, నరసాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్, తహశీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లను మండల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా నరసాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు బాల ఓబయ్య బోధించే బయాలజికల్ సైన్స్ క్లాస్ లో విద్యార్థుల మధ్యలో కూర్చుని ఆయనబోధించే పాఠ్య బోధనను విన్నారు. ఆ ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పడం లేదని గ్రహించిన కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ముందు పూర్తి గా ప్రిపేర్ అయ్యి రావాలి కదా.. ఇలా చెప్తే విద్యార్థులకు ఏమి అర్థం అవుతుందని సంబంధిత ఉపాధ్యాయుడుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు బోధించే ముందు ఉపాధ్యాయులందరు పాఠ్యాంశాలలోని వివిధ అంశాలపై ముందస్తుగా ప్రిపేర్ అయ్యి విద్యార్థులకు బోధించాలని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారి జీవిత ఆశయ వివరాలు అడిగి తెలుసు కున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యసాధన కోసం నిర్విరామంగా కృషి చేయాలన్నారు.క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచిస్తు, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.
అనంతరం స్వయంగా ఆయన పిల్లలతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. బంగాల దుంప కర్రీ సరిగా ఉడకలేదని సంబంధిత ఇన్చార్జిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటినుండి పద్ధతులు మార్చుకొని పిల్లలకు అందించే భోజనంలో మంచి ఆహారం అందించకపోతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం స్టాఫ్‌రూంలో టీచర్‌లతో సమావేశమై పాఠశాలలో అందిస్తున్న విద్యా ప్రమాణాలు, చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, మెరుగైన విద్యాప్రమాణాలు అందించేందుకు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారుఅనంతరం ప్రైమరీ హెల్త్ సెంటర్, తహశీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ పనిచేసే సిబ్బందికి తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుని ప్రజలకు మెరుగైన సేవలను ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారుఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్, మండల రెవెన్యూ అధికారి,మండల విద్యాధికారి,పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *