అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే కార్పొరేటర్ బూతు పురాణం

బోడుప్పల్ మున్సిపల్ ఒకటవ డివిజన్ కార్పోరేటర్ నిర్వాకం
సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్ల లోని క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 4 లో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. డ్రైనేజీ, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్యని అడగగా వల్గర్ గా మాట్లాడంటూ దిగిన కాలనీ ప్రజలు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అతి పెద్ద కాలనీన క్రాంతి కాలనీ అభివృద్ధికి నోచుకోక గ్రామాల కంటే అద్వానంగా ఉందని అవేదన వ్యక్తం చేసారు. ప్రతి ఇంటికి కొంత ఎమౌంట్ పోగుచేసి డ్రైనేజీ నిర్మించుకున్నాము. రోడ్ల కోసం కార్పొరేటర్ జంగయ్య ని అడిగితే నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని వారు తెలిపారు. మేము సిటీలో ఉన్నామా గ్రామంలో ఉన్నామా అనే విధంగా ఇక్కడి పరిస్థితి ఉందన్నారు.. స్కూల్ బస్సులు బురదలో దిగపడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ని సార్లు అభివృద్ధి కోసం పిర్యాదు చేసిన ఏ ఒక్కరూ పట్టించుకోలేదు స్థానికులు అవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన ధర్నాలో కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *