ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్
సిరా న్యూస్,జగిత్యాల;
ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు..జిల్లా కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్ హాజరై చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడ్ వల్ల కాస్త ఆలస్యమైందని అన్నారు. ప్రభుత్వం సామాజిక బాధ్యతగా నిరుపేద బిడ్డలకు వివాహం జరిగినప్పుడు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా కళ్యాణ లక్ష్మి తోడ్పాటునందిస్తాయన్నారు. సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇండ్లు లేని వారికి త్వరలోనే వాటి నిర్మాణానికి బీసీలకు ఐదు లక్షలు ఇతరులకు ఆరు లక్షల ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్స్ రెవెన్యూ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *