సిరా న్యూస్,ఉట్నూర్
రాథోడ్ రమేష్ కి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు భూక్యా జాన్సన్ నాయక్
ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ ఉమ్మడి జిల్లా ప్రజలకు, గిరిజన ఆదివాసీ బంజరా జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులుభూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పూలాజీ బాబా స్కూల్ ఆవరణలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పెద్దకర్మ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి భూక్యా జాన్సన్ నాయక్ హాజరయ్యారు.ఈ విషాద సమయంలో వారి కుటుంబ సబ్యులకు ఆ భగవంతుడు అండగా ఉండాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు రాథోడ్ రమేష్ కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అకాల మరణం అదిలాబాద్ జిల్లా ప్రజలకు శోకసముద్రంలో ముంచేసిందని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.