ఘోర రోడ్డు ప్రమాదం….

ముగ్గురు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి
 సిరా న్యూస్,తిరుపతి;
బుచ్చినాయుడు కండ్రిగ మండలం పార్లపల్లి సమీపంలో కార్ మరియు బైక్ ఢీకొని బైక్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వలస కార్మికులు ఆలతూరు సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు సమాచారం. కాళహస్తికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *