బందరు యూనిమోని ముందు అందోళన

 సిరా న్యూస్,మచిలీపట్నం;
తాకట్టు పెట్టిన బంగారం మాయం కావటంతో మచిలీపట్నం రైతు బజారు ఎదురుగా ఉన్న యూనిమోని సంస్థకు వినియోగదారులు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.వివరాల్లోకి వెళితే పోతురాజు అనే వ్యక్తి గత ఐదేళ్ల క్రితం అర కేజీ బంగారం తాకట్టు పెట్టి రూ.10లక్షలు రుణం తీసుకున్నాడు.తాకట్టు పెట్టిన పది రోజుల్లోనే బంగారం విడిపించుకునేందుకు వెళ్లగా బ్యాంక్ లో పని చేసే ఓ ఉద్యోగి బంగారాన్ని చోరీ చేశాడని, కేసు పెట్టామని బ్యాంక్ అధికారులు తెలిపారు.ఐదేళ్లు అవుతున్నా తన బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన పోతురాజు జనసేన నేతలతో కలిసి బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంక్ కు తాళాలు వేసి ఆందోళన చేపట్టాడు.
=

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *