AISF Ramarapu Venkatesh: ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయండి

సిరా న్యూస్, హుజురాబాద్:
ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయండి
*  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్

పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల‌ స్కాల‌ర్‌షిప్ , ఫీజు రీయంబర్స్ మెంట్స్ ను విడుదల చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్ర‌వారం హుజురాబాద్‌లో ఆయన మాట్లాడుతూ విధ్యార్ధులకు ఇవ్వాల్సిన దాదాపు 7 కోట్ల పైగా బకాయిలున్నాయని అన్నారు. స్వరాష్ట్రం వస్తే నిధులు ,నియామకాలు వస్తాయని విద్యార్థులు కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులకు మొండిచేయి చూపడం అన్యాయం అన్నారు. ఫీజు బకాయిలు సరిగా విడుదల చేయకపోవంతో కళాశాల యాజమాన్యాలు విధ్యార్థులను ఫీజులు కట్టాలని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని, ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్య పై ప్రత్యేక శ్రద్దపెట్టాలని విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి విద్యార్థులను అందుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *