-మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి
సిరా న్యూస్,మంథని;
సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి ప్రజలకు సూచించారు.
శుక్రవారం ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మ వాడలో చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ కొట్టె పద్మ రమేష్ తో కలిసి 8వార్డు లో డ్రైడే-ఫ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లలో నిల్వ నీటిని ఉంచుకోవద్దని వాటిని ఎప్పటికప్పుడు పారబోయాలన్నారు.అలాగే వార్డు లోని పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని వార్డ్ ఆఫీసర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కొట్టె రమేష్, మున్సిపాల్ సిబ్బంది ఆశ వర్కర్స్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
======