Vedma Bojju Patel: త్వరలో తులం బంగారం ఇస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరా న్యూస్, ఖానాపూర్‌
త్వరలో తులం బంగారం ఇస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అంద‌జేత‌

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, త్వరలో 1లక్ష రూపాయాలతో పాటు తులం బంగారం అందజేస్తామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 39 కళ్యాణలక్ష్మి, 6 షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. త్వరలో 1లక్ష రూపాయాలతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తొందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వం తమదని అన్నారు. సదర్మట్ కెనాల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *