సిరా న్యూస్,గాజువాక;
గాజువాక షీలా నగర్ లో ఉన్న ఎస్ టి బి ఎల్ తిరుమల బాలాజీ దివ్య క్షేత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి. వెంకయ్య నాయుడు సందర్శించారు. అయనకు ఎస్టిబిఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు
పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. తరువాత అయన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ షీలా నగర్ లో ఉన్న బాలాజీ మందిరాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతంలో ఇంత మంచి దేవాలయo ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది . ప్రజలందరూ భక్తి భావంతో ఉండాలి అప్పుడే దేశం సుఖంగా ఉంటదని ప్రతిరోజు దేవాలయం సందర్శించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే ఉంటామని అన్నారు.దేవాలయాలు భజనలు పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. సర్పంచ్ అంతా మన కుటుంబం అనుకోవాలి ఆనందం ఉంటే అన్నిపల్లి బాగుంటాయి షేర్ అండ్ కేర్ .. అందరితో కలుసుకో ఇతరులతో పంచుకో అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి బి ఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు,.. ఎస్టిబెల్ ఎండి కృష్ణ.. మహేష్. 67వ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 86 వార్డు కార్పొరేటర్ లేళ్ళ కోటేశ్వరరావు,87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్, గాజువాక నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, భక్తులు పాల్గొన్నారు…
====================