సిరాన్యూస్,ఆదిలాబాద్
రేవంత్రెడ్డికి పదవీ ఊడుతుందన్న భయం : మాజీ మంత్రి జోగు రామన్న
* రైతు గోసను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
* ఏడు నెలలు గడిచిన అమలుకానీ 6 గ్యారంటీలు
* 15000 ఇస్తేనే రైతు భరోసా.. లేదంటే రైతు బంధు నే..
ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, అలాగే గత బీఆర్ ఎస్ ప్రభుత్వం లో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలనే ఇవ్వలేని దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఖండించారు. ఏలాంటి ఆంక్షలు లేవని చెప్పి ప్రజా అభిప్రాయాన్ని సేకరించి అందులో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రయాలను మాత్రమే సేకరించి.. నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదం అన్నారు, అలాగే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకే పథకాలు అందించే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్న కనీస 6 గ్యారంటీలు ఇప్పటివరకు భర్తీ చేయకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనం అన్నారు. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ 15 000 అందించాలని డిమాండ్ చేశారు. కేవలం సీఎం పదవి ఊడూతోందన్న భయంతో రేవంత్ రెడ్డి ప్రజా సేకరణ అభిప్రాయాలు అంటూ కాలయాపన చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సహాయం అందక రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వీటిపై కనీసం శుద్ధ శుద్ధి లేకుండా వ్యవహరించడం జరుగుతుందని.మరోవైపు గ్రూప్ 2 కి సంబంధించిన సబ్జెక్టు మార్చినప్పటికి వారికి సమయం తక్కువ ఇచ్చి ఎక్సమ్ పెట్టడం ఫైన యువత వాయిదా వేయాలని ఉద్యమిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా సరికాదన్నారు .ఈ సందర్భంగా గ్రూప్ టు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కుమ్రా రాజు, ఎక్స్ ఎంపీపీసేవ్వా జగదీష్, గండ్రత్ రమేష్, రాజన్న, ఎక్స్ మార్కెట్ వైస్ చైర్మన్ వేణు గోపాల్ యాదవ్,వీ జ్జగిరి నారాయణ, సాజితోద్దీన్, నవతె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.