సిరాన్యూస్,ఖానాపూర్
కరెంట్ కోసం రైతు రాస్తారోకో
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఒక రైతు శనివారం మొలకెత్తిన ధాన్యంతో కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులకు కురుతున్నామని, అలాగే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని సుర్జాపూర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని అధికారులపై మండిపడ్డారు. రైతు సంక్షేమమంటూ గొప్పలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులకు, ప్రస్తుతం వ్యవసాయానికి కరెంటు ఎలా ఇస్తున్నారో తెలియడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్ రైతుల ఆవేదన వినిపించుకోవాలని కోరారు . ఇక ముందు కరెంటు సమస్య రావద్దని సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జ పటేల్లను కోరారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.