ముంపునకు గురవుతున్న మరిడి మహాలక్ష్మీ దేవాలయం

సిరా న్యూస్,అవనిగడ్డ;
జాతీయ రహదారి టోల్ గేట్ నిర్మాణ సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో అవనిగడ్డ మండలం పులిగడ్డలోని మరిడి మహాలక్ష్మి దేవాలయం తరచూ ముంపునకు గురవుతోంది. ఎనభై ఆరేళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఇటీవల నిర్మించిన హైవే టోల్ గేట్ కారణంగా ఆలయానికి ఈ ముంపు సమస్య ఏర్పడింది. నూతన ఆలయం నిర్మిస్తామని, స్థలం కేటాయిస్తామని హైవే టోల్ గేట్ నిర్వాహకులు మాట ఇచ్చినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. కొద్దిపాటి వర్షాలకే ఆలయంలో నీరు చేరుతోంది. ముంపు వచ్చినపుడు అమ్మవారికి కనీసం దీపారాధన కూడా చేయలేని పరిస్థితి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హామీ నిలబెట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *